విభజన హామీలు నెరవేర్చడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. ఏడేళ్ల క్రితం రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి కొన్ని వరాలు ప్రకటించారని గుర్తుచేశారు. రాజ్యసభలో ప్రకటించిన వరాలు భాజపా ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను పూర్తిగా అమలు చేసేదన్నారు. ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం.. ప్రధాని దృష్టికి రాష్ట్ర సమస్యలు