ETV Bharat / state

కడపలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల కేంద్రం ప్రారంభం

author img

By

Published : Apr 5, 2020, 1:58 PM IST

కడప జిల్లాలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల కేంద్రం ప్రారంభమైంది. ప్రభుత్వం తాజాగా గుంటూరు, కడప జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చిన నేపథ్యంలో... పరీక్షల కేంద్రాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.

Commencement of Corona Virus Testing Center in Kadapa
కడపలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభం
కడపలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభం

ప్రస్తుతం జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించిన ఫాతిమా మెడికల్ కళాశాలలోనే కరోనా నిర్ధరణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పాలనాధికారి హరికిరణ్ వెల్లడించారు. ఇవాళ్టి నుంచి రోజుకు 70 వరకు నమూనాలను పరీక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 3 రోజుల పాటు రోజుకు 70 నమూనాలను పరీక్షించిన తర్వాత... ఆ సంఖ్యను 90కి పెంచుతామని చెప్పారు.

ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వైద్య సదుపాయాలు, వైద్యులకు పీపీఈ కిట్లు, వెంటిలేషన్ సౌకర్యం అందుబాటులో ఉందన్న కలెక్టర్... ఒకటే అందుబాటులో ఉందని చెప్పారు. మరొకటి మంజూరైతే నిర్ధరణ పరీక్షలు వేగవంతం అవుతాయన్నారు. జిల్లాలో అనుమానిత లక్షణాలు ఎక్కువవుతున్న తరుణంలో తిరుపతికి వెళ్లకుండా కడపలోనే పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషించాల్సిన విషయమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కడపలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కేంద్రం ప్రారంభం

ప్రస్తుతం జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించిన ఫాతిమా మెడికల్ కళాశాలలోనే కరోనా నిర్ధరణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పాలనాధికారి హరికిరణ్ వెల్లడించారు. ఇవాళ్టి నుంచి రోజుకు 70 వరకు నమూనాలను పరీక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 3 రోజుల పాటు రోజుకు 70 నమూనాలను పరీక్షించిన తర్వాత... ఆ సంఖ్యను 90కి పెంచుతామని చెప్పారు.

ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వైద్య సదుపాయాలు, వైద్యులకు పీపీఈ కిట్లు, వెంటిలేషన్ సౌకర్యం అందుబాటులో ఉందన్న కలెక్టర్... ఒకటే అందుబాటులో ఉందని చెప్పారు. మరొకటి మంజూరైతే నిర్ధరణ పరీక్షలు వేగవంతం అవుతాయన్నారు. జిల్లాలో అనుమానిత లక్షణాలు ఎక్కువవుతున్న తరుణంలో తిరుపతికి వెళ్లకుండా కడపలోనే పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషించాల్సిన విషయమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.