ETV Bharat / state

అరటి రైతులు.. ఆకలి కేకలు - kadapa distrcit banana farmers

గత 4 రోజులుగా వీచిన పెనుగాలులు, అకాల వర్షాలకు అరటి, బొప్పాయి, మామిడి పండ్ల తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలు ఖర్చు చేసి పండించిన అరటి పంట చేతికి అందకుండా పోయింది. లాక్​డౌన్​ కారణంగా రవాణా సౌకర్యం నిలిచిపోయిన కారణంగా.. రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకొచ్చిన తరుణంలో అకాల వర్షం, గాలుల తీవ్రత వల్ల అరటిపంట పూర్తిగా దెబ్బతింది.

అరటి రైతుల ఆకలి అరుపులు
అరటి రైతుల ఆకలి అరుపులు
author img

By

Published : Apr 15, 2020, 4:53 PM IST

అకాల వర్షాలకు నేలకొరిగిన అరటి చెట్లు

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులు ఎక్కువగా అరటి పంటను పండిస్తున్నారు. ఓబులవారిపల్లి, చిట్వేలు, రైల్వే కోడూరు మండలాల్లో సుమారు 550 ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు. పది పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు, పెను గాలుల వల్ల పంట మొత్తం దెబ్బతింది. లక్షలు వెచ్చించి పండించిన పంట పూర్తిగా ధ్వంసం అవ్వటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.

5 కోట్ల పంట నష్టం

అకాల వర్షాలు... పెను గాలుల వల్ల అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఓబులవారిపల్లి, రైల్వే కోడూరు మండలాల్లో దాదాపు 5 కోట్లకు పైగా అరటి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. రైతుల వివరాలను పై అధికారులకు పంపించి పరిహారం అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

అరటి అక్కరకు రానంటోంది: రైతన్న ఆవేదన

అకాల వర్షాలకు నేలకొరిగిన అరటి చెట్లు

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులు ఎక్కువగా అరటి పంటను పండిస్తున్నారు. ఓబులవారిపల్లి, చిట్వేలు, రైల్వే కోడూరు మండలాల్లో సుమారు 550 ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు. పది పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు, పెను గాలుల వల్ల పంట మొత్తం దెబ్బతింది. లక్షలు వెచ్చించి పండించిన పంట పూర్తిగా ధ్వంసం అవ్వటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.

5 కోట్ల పంట నష్టం

అకాల వర్షాలు... పెను గాలుల వల్ల అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఓబులవారిపల్లి, రైల్వే కోడూరు మండలాల్లో దాదాపు 5 కోట్లకు పైగా అరటి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. రైతుల వివరాలను పై అధికారులకు పంపించి పరిహారం అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

అరటి అక్కరకు రానంటోంది: రైతన్న ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.