ETV Bharat / state

'నియంత్రికల ఏర్పాటులో ప్రాధాన్యం'

author img

By

Published : Jun 20, 2020, 12:49 PM IST

ఎర్రగుంట్ల విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ్‌రావు పరిశీలించారు. జిల్లాలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు రూ.75 కోట్లతో అవసరమైన పనులు జరుగుతున్నాయని సీఎండీ తెలిపారు.

apspdcl cmd
apspdcl cmd

విద్యుత్తు నియంత్రికల కోసం జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులు డబ్బులు చెల్లించారని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ్‌రావు తెలిపారు. ముందుగా అత్యవసరమైన వారికి నియంత్రికలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం ఎర్రగుంట్ల విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు రూ.75 కోట్లతో అవసరమైన పనులు జరుగుతున్నాయని సీఎండీ తెలిపారు. సెప్టెంబరు నెలాఖరుకు ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మించబోతున్న ఉక్కుపరిశ్రమకు సంబంధించి ఎంత విద్యుత్, ఎప్పటికి అవసరమవుతుందన్న విషయాలను పరిశీలించేందుకు వచ్చినట్లు సీఎండీ వెల్లడించారు.

విద్యుత్తు నియంత్రికల కోసం జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులు డబ్బులు చెల్లించారని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ్‌రావు తెలిపారు. ముందుగా అత్యవసరమైన వారికి నియంత్రికలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం ఎర్రగుంట్ల విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు రూ.75 కోట్లతో అవసరమైన పనులు జరుగుతున్నాయని సీఎండీ తెలిపారు. సెప్టెంబరు నెలాఖరుకు ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మించబోతున్న ఉక్కుపరిశ్రమకు సంబంధించి ఎంత విద్యుత్, ఎప్పటికి అవసరమవుతుందన్న విషయాలను పరిశీలించేందుకు వచ్చినట్లు సీఎండీ వెల్లడించారు.

ఇదీ చదవండి: వారిలో 43 మంది మొదటిసారి రాజ్యసభకు ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.