ETV Bharat / state

" వివేకా కేసు పూర్వాపరాలు సమీక్షించాలి" - kadapa new sp comments on ys viveka murder

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్, ట్రాఫిక్ సమస్యలు, మహిళ రక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న అమ్బురాజన్
author img

By

Published : Oct 11, 2019, 2:06 PM IST

Updated : Oct 11, 2019, 11:48 PM IST

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ కడపలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు, మహిళ రక్షణ అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో ఎర్రచందనం రవాణాతోపాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మహిళలు, సామాన్యులు ధైర్యంగా పోలీస్ స్టేషన్​కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్బురాజన్ వివరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛేదించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది, సిట్ దర్యాప్తు ముగిసిందా లేదా అన్న అంశాలు సమీక్షించిన తర్వాత సమగ్ర వివరాలు అందిస్తారని వివరించారు.

" వివేకా కేసు పూర్వాపరాలు సమీక్షించాలి"

ఇదీ చదవండి : కడప ఈఎస్ఐ మందుల గోదాముల్లో విజిలెన్స్ తనిఖీలు

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్ కడపలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు, మహిళ రక్షణ అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో ఎర్రచందనం రవాణాతోపాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మహిళలు, సామాన్యులు ధైర్యంగా పోలీస్ స్టేషన్​కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్బురాజన్ వివరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛేదించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది, సిట్ దర్యాప్తు ముగిసిందా లేదా అన్న అంశాలు సమీక్షించిన తర్వాత సమగ్ర వివరాలు అందిస్తారని వివరించారు.

" వివేకా కేసు పూర్వాపరాలు సమీక్షించాలి"

ఇదీ చదవండి : కడప ఈఎస్ఐ మందుల గోదాముల్లో విజిలెన్స్ తనిఖీలు

Ap_vsp_06_11_baby_dead_family_members_agitation_av_one_town_nagesh Contributor : nageswararao, eenadu, one town, visakha. Anchor : విశాఖలోని ప్రభుత్వ గోషా ఆసుపత్రిలో.. మగ శిశువు మృతి వివాదానికి కారణమైంది.వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు తలపై గాయాలై రక్తం స్రావం వల్ల మృతి చెందిందని అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముంగిట శిశువు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 11.30 గంటలకు మగ శిశువు జన్మించిందని, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల శిశువు మృతి చెందిందని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత.. పేగు చుట్టుకోవడం వల్ల మృతి చెందారని వైద్యులు చెప్పారన్నారు. రెండుసార్లు రెండు విధాలుగా చెప్పడంతో.. అనుమానం వచ్చి శిశువుని పరిశీలించడంతో తలపై గాయాలు రక్తం ఉన్నాయని వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తవలస చెందిన పెద్ద గాడ ప్రసన్నకుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. భార్య పెదగాడి జ్యోతికి నెలలు నిండడంతో ఈ నెల 9వ తేదీన ప్రభుత్వ గోషా ఆస్పత్రికి పురుడు కోసం తీసుకువచ్చారు. రాత్రి పదకొండున్నర గంటలకు జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Last Updated : Oct 11, 2019, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.