ETV Bharat / state

ఆ పాఠశాలలు సమస్యలకు నిలయాలు

కడపజిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. సమస్యల వలయంలో చిక్కుకున్న పాఠశాలలో విద్యార్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ పాఠశాల సమస్యలను తీర్చాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

author img

By

Published : Sep 23, 2019, 4:01 PM IST

పాఠశాలలో చిన్నపాటి వర్షంకే..అవస్థలు
పాఠశాలలో చిన్నపాటి వర్షంకే..అవస్థలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగాఉంది. నియోజక వర్గంలో మొత్తం 9 ఉన్నతపాఠశాలలు,24 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండటంతో, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ పాఠశాల చూసినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్దులు చేసేది ఏమిలేక అలాగే సర్దుకుపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోతోంది. తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఉడుతున్నాయి. ఈ గదుల్లోనే విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇకనైనా అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...

పాఠశాలలో చిన్నపాటి వర్షంకే..అవస్థలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగాఉంది. నియోజక వర్గంలో మొత్తం 9 ఉన్నతపాఠశాలలు,24 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండటంతో, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ పాఠశాల చూసినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్దులు చేసేది ఏమిలేక అలాగే సర్దుకుపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోతోంది. తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఉడుతున్నాయి. ఈ గదుల్లోనే విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇకనైనా అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...

Intro:లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలి

అర్హులైన లభిదారులందరికీ వెంటనే న్యాయం చేయాలంటూ ప్రజలతో కలిసి సీపీఐ నాయకులు పురిపాలిక కార్యాలయంలో పెద్డ ఎత్తున ధర్నా చేపట్టారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ పథకం ద్వారా గృహ నిర్మాణాలు చేపడతామని 8 సంవత్సరాల క్రితం ఒకొక్కరితో రూ.2,100 నగదు తీసుకుని పట్టాలు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఉన్న భూమిని చూపకుండా అధికారులు, నాయకులు కలిసి పేద ప్రజలను మోసం చేస్తున్నారంటూ సీపీఐ నాయకులు లబ్దిదారులతో కలిసి పురిపాలిక కార్యాలయంలో ధర్నా చేపట్టారు. 25 రోజుల్లో నగదు చెల్లించిన లభ్దిదారులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. పురిపాలిక ఇంచార్జి కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి జాపర్, నాయకులు చిరంజీవి, రంగయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు..


Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
ఫోన్: 7799077211
7093981598


Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.