పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఆకుల రఘు పేర్కొన్నారు. రాజమండ్రి కోటిలింగాల రేవుకు చెందిన కె.సత్తిబాబు... తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, గుడివాడ, తణుకు ప్రాంతాల్లో ఇంటి దొంగతనానికి పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. సత్తిబాబు పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.
మరొక కేసులో కందుల యేసురాజు అనే వ్యక్తి జిల్లాలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడని సీఐ వెల్లడించారు. ఇరువురు నుంచి 207 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ చెప్పారు.
ఇదీచదవండి