ETV Bharat / state

"స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయండి" - ttd chairman explained about navaratnas

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. లబ్ధిదారులకు తమ ప్రభుత్వంలో ఎప్పుడూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. తణుకులో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.

ttd chairman explained about navaratnas
నవరత్నాల గురించి వివరిస్తోన్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Dec 21, 2019, 12:36 PM IST

తణుకులో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలను అమలు చేస్తున్నారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన... ఆరు నెలల పరిపాలన కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్​కు దక్కుతుందని తెలిపారు. అనర్హుల రేషన్ కార్డులు తీసివేస్తామే గానీ.. అర్హులైన వారి కార్డులను తీసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. తొలుత వేల్పూర్ రోడ్డు నుంచి సభా వేదిక వద్దకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రథసారధిగా జోడు గుర్రాల రథంపై అతన్ని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం భారీ గజమాల, నూతన పట్టు వస్త్రాలతో సత్కరించారు.

ఇదీ చూడండి: సాఫ్ట్‌వేర్‌ సుబ్రమణ్యం.. ఆదర్శ వ్యవసాయం

తణుకులో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలను అమలు చేస్తున్నారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన... ఆరు నెలల పరిపాలన కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్​కు దక్కుతుందని తెలిపారు. అనర్హుల రేషన్ కార్డులు తీసివేస్తామే గానీ.. అర్హులైన వారి కార్డులను తీసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. తొలుత వేల్పూర్ రోడ్డు నుంచి సభా వేదిక వద్దకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రథసారధిగా జోడు గుర్రాల రథంపై అతన్ని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం భారీ గజమాల, నూతన పట్టు వస్త్రాలతో సత్కరించారు.

ఇదీ చూడండి: సాఫ్ట్‌వేర్‌ సుబ్రమణ్యం.. ఆదర్శ వ్యవసాయం

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_12_14_TANUKU_TTD_CHAIRMAN_AB_AP10092
( ) తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. తొలుత వేల్పూర్ రోడ్డు నుంచి సభా వేదిక వద్దకు ఎమ్మెల్యే నాగేశ్వరావు రథసారధిగా జోడు గుర్రాల రథంపై సుబ్బారెడ్డిని వేదిక వద్దకు తీసుకువచ్చారు.


Body:సుబ్బారెడ్డిని క్రేన్ సహాయంతో భారీ గజమాలతో నూతన పట్టు వస్త్రాలతో ఉచిత రీతిన సత్కరించారు. ఎమ్మెల్యే కారుమూరి దంపతులతో పాటు మంత్రులు తానేటి వనిత చెరుకువాడ రంగనాథ రాజు జిల్లాలోని ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు సన్మానించారు.


Conclusion:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలను అమలు చేస్తున్నారనని, ఆరు నెలల పరిపాలన కాలంలో నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు అనర్హులకు రేషన్ కార్డులు చేస్తారే తప్ప అర్హులైన వారి కార్డులను తీసేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపొందే లా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఎంపీలు కనుమూరు రఘురామ కృష్ణం రాజు, కోటగిరి శ్రీధర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బైట్: వై వి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.