తన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక... మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పట్టణానికి చెందిన మల్లికార్జునరావు ఔషధ, వస్త్ర దుకాణాలు నిర్వహిస్తూ జీవించేవాడు. కొన్ని రోజు క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతిని జీర్ణించుకోలేకపోయిన మల్లికార్జునరావు... ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
భార్య మృతిచెందిన కొన్ని రోజులకే... భర్త బలవన్మరణం - eluru crime updates
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం జరిగింది. కొన్నిరోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందటంతో... మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్య చనిపోయిన కొద్దినెలల్లోనే భర్త మృతి
భార్య మృతిచెందిన కొన్ని రోజులకే... భర్త బలవన్మరణం
తన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక... మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పట్టణానికి చెందిన మల్లికార్జునరావు ఔషధ, వస్త్ర దుకాణాలు నిర్వహిస్తూ జీవించేవాడు. కొన్ని రోజు క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతిని జీర్ణించుకోలేకపోయిన మల్లికార్జునరావు... ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
భార్య మృతిచెందిన కొన్ని రోజులకే... భర్త బలవన్మరణం
ఫీడ్: AP_TPG_06_25_HUSBAND_SUCIDE_AV_AP10089
రిపోర్టర్: పి.చింతయ్య
సెంటర్: ఏలూరు, ప.గో.జిల్లా
( ) భార్య అనారోగ్య కారణంతో మృతి చెందటంతో తాను ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక నీ వెంటే నేను అంటూ కొద్ది నెలల వ్యవధిలోనే తీవ్ర మనోవేదనకు గురైన భర్త బలవన్మరణం చేసుకొని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరులోని పవర్పేట చెందిన మొలుగు మల్లికార్జున రావు కు భార్య విమల దేవి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లికార్జున రావు మందుల దుకాణం వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. 6 నెలల క్రితం భార్య విమలా దేవి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. అప్పటి నుంచి తాను ఒంటరిని అయిపోయానని తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మల్లికార్జున రావు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా చనిపోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉండలేకసమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Oct 26, 2019, 1:16 PM IST