ETV Bharat / state

చెరువు కంచెలో చిక్కిన కొండచిలువలు.. కాపాడిన స్నేక్ హెల్పర్

author img

By

Published : Mar 13, 2021, 7:36 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపల్లిలోని చెరువుకు కంచెగా వేసిన వలలో రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. వాటిని రాజమహేంద్రవరానికి చెందిన సర్ప రక్షకుడు కాపాడారు.

the-serpent-protector-rescued-the-trapped-pythons-in-a-pond-in-kottapalli-ganapavaram-mandal-west-godavari-district
కొండచిలువలను రక్షించిన సర్ప రక్షకుడు...

కొండచిలువలను రక్షించిన సర్ప రక్షకుడు...

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లిలోని చేపల చెరువుకు రక్షణ కంచెగా ఏర్పాటు చేసిన వలలో రెండు కొండ చిలువలు చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన సర్ప రక్షకుడు ఈశ్వరరావు సమాచారం అందుకుని కొండ చిలువలను వల నుంచి విడిపించారు.

ఏడాది వయసున్న ఆ పాములు.. 11 నుంచి 12 అడుగుల పొడవుతో 25 కిలోల చొప్పున బరువు ఉన్నాయని ఈశ్వరరావు తెలిపారు. వాటిని వణ్యప్రాణి విభాగం వైద్యాధికారులు పరీక్షించారు. త్వరలోనే అటవీ ప్రాంతంలో వదులుతామని తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల పాముల్ని తాను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టానని ఈశ్వరరావు చెప్పారు.

కొండచిలువలను రక్షించిన సర్ప రక్షకుడు...

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లిలోని చేపల చెరువుకు రక్షణ కంచెగా ఏర్పాటు చేసిన వలలో రెండు కొండ చిలువలు చిక్కుకున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన సర్ప రక్షకుడు ఈశ్వరరావు సమాచారం అందుకుని కొండ చిలువలను వల నుంచి విడిపించారు.

ఏడాది వయసున్న ఆ పాములు.. 11 నుంచి 12 అడుగుల పొడవుతో 25 కిలోల చొప్పున బరువు ఉన్నాయని ఈశ్వరరావు తెలిపారు. వాటిని వణ్యప్రాణి విభాగం వైద్యాధికారులు పరీక్షించారు. త్వరలోనే అటవీ ప్రాంతంలో వదులుతామని తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల పాముల్ని తాను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టానని ఈశ్వరరావు చెప్పారు.

ఇదీ చదవండి:

గోపాలపురం వైకాపాలో వర్గవిబేధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.