ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ - ద్వారకాతిరుమల తాజా వార్తలు
చిన తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.
![ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ State Election Commissioner Nimmagadda Rameshkumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10322934-38-10322934-1611216240126.jpg?imwidth=3840)
ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్
ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్... పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి అభిషేక, అర్చనల్లో పాల్గొన్న తర్వాత... నిమ్మగడ్డ రమేశ్కు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి: