ETV Bharat / state

లాక్​డౌన్​: బోర్​కొట్టి కోడి పందేలు ఆడారు... చివరికి! - police lotty charge lockdown live updates

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ఆందోళన చెంది.. ఏకంగా ప్రధాని మోదీనే దేశమంతా లాక్​డౌన్​ విధించారు. ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. కాలు బయటపెడితే లాఠీ విరిగేలా పోలీసులు దంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచని ఈ జనాలు కోడి పందేల వైపు ఆసక్తి చూపారు. గుంపులు గుంపులుగా చేరి జూదం ఆడారు. ఈ సమాచారం పోలీసులకు అందింది. వెంటనే లాఠీ విరిగింది. లింగ భేదం లేకుండా.. అందరినీ చితకబాదారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

కోడిపందేలు ఆడారని చితకబాదిన పోలీసులు
police lotty charge on pepole palyed cock fight in lockdown situation in west godavari dst thadepalligudem
author img

By

Published : Mar 26, 2020, 11:45 AM IST

కోడిపందేలు ఆడారని చితకబాదిన పోలీసులు

ఒకపక్క కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా గడగడలాడుతుంటే అదేమీ పట్టనట్లు కొందరు జూదగాళ్లు పేకాటలతో, కోడి పందాలతో విందు వినోదాల్లో మునిగి తేలారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గాయత్రి గుడి సెంటర్లో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు పలువురు కానిస్టేబుళ్ళు సంఘటనా స్థలానికి వెళ్లారు. అదేమని ప్రశ్నంచగా పోలీసులపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి లాఠీ దెబ్బలు తినిపించారు. వాళ్ల దగ్గర నుంచి ఓ కోడిని, 600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారు శిక్షార్హులని పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరించారు.

కోడిపందేలు ఆడారని చితకబాదిన పోలీసులు

ఒకపక్క కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా గడగడలాడుతుంటే అదేమీ పట్టనట్లు కొందరు జూదగాళ్లు పేకాటలతో, కోడి పందాలతో విందు వినోదాల్లో మునిగి తేలారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గాయత్రి గుడి సెంటర్లో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు పలువురు కానిస్టేబుళ్ళు సంఘటనా స్థలానికి వెళ్లారు. అదేమని ప్రశ్నంచగా పోలీసులపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి లాఠీ దెబ్బలు తినిపించారు. వాళ్ల దగ్గర నుంచి ఓ కోడిని, 600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారు శిక్షార్హులని పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరించారు.

ఇదీ చూడండి:

కరోనా కష్టాలు.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి నో ఎంట్రీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.