పోలవరం ప్రాజెక్టులో భాగంగా కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టారు. గోదావరినదికి అడ్డంగా వీటిని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. రాక్ ఫిల్ డ్యామ్ కు ఎగువ దిగువున కాఫర్ డ్యామ్ లు నిర్మాణం పూర్తిచేసి.. గ్రావీటితో నీటిని అందించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. గోదావరి వరదను స్పిల్వే వైపు మళ్లించటం వల్ల.. రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేయవచ్చని అధికారులు భావించారు. దీంతో కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా చేశారు. ఆగమేఘాలతో మట్టి, రాళ్లతో నిర్మించిన కాఫర్ డ్యామ్ లు అఖండ గోదావరిలో నిలుస్తాయా అన్న ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలు కొట్టుకుపోతాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-'తిరుమల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం'