ETV Bharat / state

పెట్రోల్ పోసి తగలబెట్టారు... దారుణంగా చంపేశారు!

author img

By

Published : Apr 28, 2020, 6:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దుద్దుకూరులో దారుణం జరిగింది. స్థానిక మద్యం దుకాణం వద్ద కాపాలాదురుగా పనిచేస్తున్న వ్యక్తిని.. గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

murset in west godavari district
పెట్రోల్ పోసి దారుణంగా హత్య

పశ్చిమ గోదావరి జిలా దేవరపల్లి మండలంలోని మల్లిపూడికి చెందిన వెంకటేష్.. దుద్దుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాచ్​మన్​గా పని చేసేవాడు. సోమవారం రాత్రి మద్యం దుకాణం వద్ద నిద్రిస్తున్న అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్య చేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మద్యం దొంగలించేందుకు వచ్చి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిలా దేవరపల్లి మండలంలోని మల్లిపూడికి చెందిన వెంకటేష్.. దుద్దుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాచ్​మన్​గా పని చేసేవాడు. సోమవారం రాత్రి మద్యం దుకాణం వద్ద నిద్రిస్తున్న అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్య చేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మద్యం దొంగలించేందుకు వచ్చి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

మాస్కులు లేకుండా బయటకు వస్తే అంతే…

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.