ETV Bharat / state

సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లాలో సత్యనారాయణపురంలో పడవ ప్రమాదం తప్పింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

author img

By

Published : Oct 15, 2020, 7:34 PM IST

Missed boat accident in Satyanarayanapuram west godavari district
సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో త్రుటిలో పడవ ప్రమాదం తప్పింది. గుండేరు డ్రైన్​లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో... స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచన మేరకు మత్స్యశాఖ అధికారులు రెస్క్యూ బోటు ఏర్పాటు చేశారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా... ఇంజిన్​ మరమ్మతులకు లోనై బోటు కొట్టుకుపోయింది. అందులో ఉన్న వారు చెట్ల కొమ్మలను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో త్రుటిలో పడవ ప్రమాదం తప్పింది. గుండేరు డ్రైన్​లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో... స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచన మేరకు మత్స్యశాఖ అధికారులు రెస్క్యూ బోటు ఏర్పాటు చేశారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా... ఇంజిన్​ మరమ్మతులకు లోనై బోటు కొట్టుకుపోయింది. అందులో ఉన్న వారు చెట్ల కొమ్మలను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 4,038 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.