ETV Bharat / state

వివాహిత అనుమానాస్పద మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట శివారు ప్రాంతం కాపులపాలెంలో మానేపల్లి సుజాత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె తల్లిదండ్రులు సుజాత భర్త, అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశారు. కట్నం కోసం వారే తమ కూతుర్ని చంపేశారని ఆరోపించారు.

author img

By

Published : Apr 21, 2020, 4:02 PM IST

married woman doubtful death at aachanta west godavari district
వివాహిత అనుమానాస్పద మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట శివారు ప్రాంతం కాపులపాలెంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మానేపల్లి సుజాత అనే మహిళ ఇంట్లో విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు సుజాత భర్త, అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా అల్లుడు కట్నం కోసం తమ కూతుర్ని వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట శివారు ప్రాంతం కాపులపాలెంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మానేపల్లి సుజాత అనే మహిళ ఇంట్లో విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు సుజాత భర్త, అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా అల్లుడు కట్నం కోసం తమ కూతుర్ని వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి.. ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.