ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో.. లోకేశ్ పర్యటన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నర్సాపురం మండలంలో ముంపునకు గురైన పంటలు, ఇళ్ళను పరిశీలించారు.

author img

By

Published : Aug 7, 2019, 5:31 PM IST

లోకేశ్ పర్యటన
వరద ముంపు ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించారు. ముంపునకు గురైన పంటలను, ఇళ్లను పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై తెదేపా బృందం ఆరా తీసింది.

పోలవరంలో అవినీతి జరిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పిన మాటలను గమనించాలన్నారు లోకేశ్​. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పోలవరం వ్యయం పెరుగుతుందన్నారు. రాజధానిని నిర్మించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులోనూ కోత విధిస్తున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను మూసివేయటం కక్ష సాధింపు చర్యలేనన్నారు. వర్షాలు, వరదలతో పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోవటం లేదని ఆరోపించారు.

ఇది కూడా చదవండి.

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం.. ఉత్తర్వులు జారీ

వరద ముంపు ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించారు. ముంపునకు గురైన పంటలను, ఇళ్లను పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై తెదేపా బృందం ఆరా తీసింది.

పోలవరంలో అవినీతి జరిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పిన మాటలను గమనించాలన్నారు లోకేశ్​. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పోలవరం వ్యయం పెరుగుతుందన్నారు. రాజధానిని నిర్మించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులోనూ కోత విధిస్తున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను మూసివేయటం కక్ష సాధింపు చర్యలేనన్నారు. వర్షాలు, వరదలతో పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన వారికి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోవటం లేదని ఆరోపించారు.

ఇది కూడా చదవండి.

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం.. ఉత్తర్వులు జారీ

Intro:స్లగ్ కృష్ణా జిల్లా మైలవరం ఎల్ బి ఆర్ సి లో ఘనంగా ఫ్రెషర్స్ డే
కృష్ణాజిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు నూతనంగా చేరిన విద్యార్థులలో అవగాహన కొరకు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గా యాజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి చి ప్రసంగించారు కళాశాల నందు కోర్సులు విద్యా విధానం విద్యార్థులలో క్రమశిక్షణ వంటి పలు అంశాలను వివరించారు ప్రతి విద్యార్థి ఈ సమయంలో లో తన విద్య పై శ్రద్ధ పెట్టి తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కళాశాల వైస్ చైర్మన్ లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇ పిలుపునిచ్చారు అనంతరం హాజరు శాతం ఉత్తీర్ణత లో ప్రతిభ వంటి పలు అంశాలలో సీనియర్ విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించారు ఈ కార్యక్రమంలో లో కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇన్ఫ్రా డైరెక్టర్ తిమ్మారెడ్డి ఇ ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు


Body:ఎల్ బి ఆర్ సి లో ఘనంగా ఫ్రెషర్స్ డే


Conclusion:లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.