ETV Bharat / state

బయటికి వద్దు.. ప్రాణాలే ముద్దు

author img

By

Published : Mar 25, 2020, 8:46 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. సరదాగా తిరగడానికి బయటికి వస్తే.. ఊరుకోబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

lock down in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో లాక్​డౌన్

జంగారెడ్డిగూడెంలో లాక్​డౌన్

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీసులకు ఆమె పలు సూచనలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అనవసరంగా రహదారులపై తిరిగే వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు బయటకు రావాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు.

ఏలూరులో లాక్​డౌన్

జిల్లాలో కరోనా అనుమానిత మూడు కేసుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రెండు రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించగా.. వారు ఏలూరు ఆస్పత్రిలో చేరారు. వీరి ముగ్గురు రిపోర్టులు నెగెటివ్ రావడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 11 మంది కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. వీరిలో ఏడుగురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చంది. మిగితా నలుగురి రిపోర్ట్ రావాల్సి ఉంది. నెగెటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపివేశారు. కొద్దిరోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని వారిని హెచ్చరించారు.

రాఘవాపురంలో కరోనా పాజిటివ్

చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఓ విందులో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ వేడుకలో పాల్గొన్న డీఎస్పీ, అతని ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలగా.. అధికారులు గ్రామంలో చర్యలు చేపట్టారు. తాగునీటి ట్యాంకులు, డ్రైనేజీలు, పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర తమ ఆధీనంలోకి తీసుకుని బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

తణుకులో లాక్​డౌన్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌అమలులో ఉండటంతో జిల్లాలోని తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూరగాయల మార్కెటలో పర్యటించారు. ధరలు పెంచి అమ్మితే ఎంతమాత్రం సహించబోమన్నారు. అధిక ధరలకు అమ్మితే హోల్‌సేల్‌ దుకాణాలను సైతం మూయించి వేయిస్తానని హెచ్చరించారు. వినియోగదారులు నేరుగా తమ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాలవద్దే కొనుగోలు చేయాలని సూచించారు. నాలుగు రూపాయలు తక్కువకు వస్తున్నాయనే ఆలోచన కంటే ఆరోగ్యం ముఖ్యమని అందరూ భావించాలని 21 రోజులుపాటు లాక్‌డౌన్‌ అమలయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.

దెందులూరులో లాక్​డౌన్

కరోనా ప్రభావంతో గ్రామాల్లో అధికారుల సూచనలతో.. గ్రామస్థులు స్వీయ రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు గ్రామాలకు వచ్చే రహదారులను మూసేస్తున్నారు. ముళ్ళ పొదలు, రాళ్లు తదితర వాటితో రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా.. బయటివారు గ్రామానికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్​కి వెళ్లకుండా తాడు అడ్డంగా కట్టారు.

జీలుగుమిల్లిలో లాక్​డౌన్

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దులోని జీలుగుమిల్లిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా కట్టడి చేశారు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిని పోలీసులు పూర్తిగా నిర్బంధించారు. వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

జిల్లాలో లాక్ డౌన్... అంతటా కర్ఫ్యూ వాతావరణం

జంగారెడ్డిగూడెంలో లాక్​డౌన్

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీసులకు ఆమె పలు సూచనలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అనవసరంగా రహదారులపై తిరిగే వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు బయటకు రావాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు.

ఏలూరులో లాక్​డౌన్

జిల్లాలో కరోనా అనుమానిత మూడు కేసుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రెండు రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించగా.. వారు ఏలూరు ఆస్పత్రిలో చేరారు. వీరి ముగ్గురు రిపోర్టులు నెగెటివ్ రావడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 11 మంది కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. వీరిలో ఏడుగురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చంది. మిగితా నలుగురి రిపోర్ట్ రావాల్సి ఉంది. నెగెటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపివేశారు. కొద్దిరోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని వారిని హెచ్చరించారు.

రాఘవాపురంలో కరోనా పాజిటివ్

చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఓ విందులో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ వేడుకలో పాల్గొన్న డీఎస్పీ, అతని ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలగా.. అధికారులు గ్రామంలో చర్యలు చేపట్టారు. తాగునీటి ట్యాంకులు, డ్రైనేజీలు, పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర తమ ఆధీనంలోకి తీసుకుని బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

తణుకులో లాక్​డౌన్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌అమలులో ఉండటంతో జిల్లాలోని తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూరగాయల మార్కెటలో పర్యటించారు. ధరలు పెంచి అమ్మితే ఎంతమాత్రం సహించబోమన్నారు. అధిక ధరలకు అమ్మితే హోల్‌సేల్‌ దుకాణాలను సైతం మూయించి వేయిస్తానని హెచ్చరించారు. వినియోగదారులు నేరుగా తమ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాలవద్దే కొనుగోలు చేయాలని సూచించారు. నాలుగు రూపాయలు తక్కువకు వస్తున్నాయనే ఆలోచన కంటే ఆరోగ్యం ముఖ్యమని అందరూ భావించాలని 21 రోజులుపాటు లాక్‌డౌన్‌ అమలయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.

దెందులూరులో లాక్​డౌన్

కరోనా ప్రభావంతో గ్రామాల్లో అధికారుల సూచనలతో.. గ్రామస్థులు స్వీయ రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు గ్రామాలకు వచ్చే రహదారులను మూసేస్తున్నారు. ముళ్ళ పొదలు, రాళ్లు తదితర వాటితో రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా.. బయటివారు గ్రామానికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్​కి వెళ్లకుండా తాడు అడ్డంగా కట్టారు.

జీలుగుమిల్లిలో లాక్​డౌన్

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దులోని జీలుగుమిల్లిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా కట్టడి చేశారు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిని పోలీసులు పూర్తిగా నిర్బంధించారు. వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

జిల్లాలో లాక్ డౌన్... అంతటా కర్ఫ్యూ వాతావరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.