ETV Bharat / state

పశ్చిమగోదావరిజిల్లాలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - పశ్చిమగోదావరి తాజా వార్తలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా పశ్చిమగోదావరిజిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువ జాము నుంచే స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణాల్లో కొవిడ్​ నిబంధనలు పాటించే విధంగా ఆలయ కమిటీలు చర్యలు తీసుకుంటున్నాయి.

karthika pavurnami celebrations
పశ్చిమగోదావరిజిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు
author img

By

Published : Nov 30, 2020, 5:25 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు ఈశ్వరుని నామస్మరణతో మార్మోగాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలవద్ద దర్శనం కోసం బారులుతీరారు. మహిళలు కార్తిక దీపోత్సవ పూజలు నిర్వహించారు. ఏలూరులోని పత్తేబాద శివాలయం, పాతశివాలయం, శనివారపుపేట శివాలయాల్లో ప్రత్యేక అభిషేక, అర్చనలు నిర్వహించారు. అలాగే సామూహిక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం సోమేశ్వర జనర్ధాన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయాల దర్శనానికి భక్తులు వేకువ జాము నుంచే బారులుతీరారు.

ఇదీ చదవండీ...

పశ్చిమగోదావరిజిల్లాలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు ఈశ్వరుని నామస్మరణతో మార్మోగాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలవద్ద దర్శనం కోసం బారులుతీరారు. మహిళలు కార్తిక దీపోత్సవ పూజలు నిర్వహించారు. ఏలూరులోని పత్తేబాద శివాలయం, పాతశివాలయం, శనివారపుపేట శివాలయాల్లో ప్రత్యేక అభిషేక, అర్చనలు నిర్వహించారు. అలాగే సామూహిక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం సోమేశ్వర జనర్ధాన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయాల దర్శనానికి భక్తులు వేకువ జాము నుంచే బారులుతీరారు.

ఇదీ చదవండీ...

శ్రీశైల మహాక్షేత్రం: నేత్ర శోభితం.. జ్వాలా తోరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.