ETV Bharat / state

అనాథల అమ్మకు అంగరంగవైభవంగా షష్టి పూర్తి

తూర్పు గోదావరి జిల్లా కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వక్కలంక వాణికి ఆదివారం షష్టిపూర్తి వేడుక నిర్వహించారు.

author img

By

Published : Dec 27, 2021, 8:55 AM IST

kamakshipeetam-permanent-meber-vakkalanka-vani-60-years-anniversary-celebrations
అనాథల అమ్మకు అంగరంగవైభవంగా షష్టి పూర్తి

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వక్కలంక వాణికి ఆదివారం 60 వసంతాల వేడుక (షష్టి పూర్తి) నిర్వహించారు. ఈ వేడుకను నిర్వహించింది ఆమె కన్నబిడ్డలు కాదు.. అసలు ఆమెకు వివాహమే కాలేదు. 1982 నుంచి అమలాపురంలోని పీఠంలో ఆమె చేతుల మీద పెరిగిన 156 మంది అనాథలు.. తమ అమ్మకు ఘనంగా 60 వసంతాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘వివాహం చేసుకుంటే చిన్నారులకు దూరమవుతాననే భయంతోనే ఆ ఆలోచనను కూడా దరిచేరనీయలేదు. బంధువులు, కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా ఈ పిల్లల్నే నా వాళ్లుగా భావిస్తూ వారికి సేవ చేస్తున్నా’ అని వాణి ఈ సందర్భంగా చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వక్కలంక వాణికి ఆదివారం 60 వసంతాల వేడుక (షష్టి పూర్తి) నిర్వహించారు. ఈ వేడుకను నిర్వహించింది ఆమె కన్నబిడ్డలు కాదు.. అసలు ఆమెకు వివాహమే కాలేదు. 1982 నుంచి అమలాపురంలోని పీఠంలో ఆమె చేతుల మీద పెరిగిన 156 మంది అనాథలు.. తమ అమ్మకు ఘనంగా 60 వసంతాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘వివాహం చేసుకుంటే చిన్నారులకు దూరమవుతాననే భయంతోనే ఆ ఆలోచనను కూడా దరిచేరనీయలేదు. బంధువులు, కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా ఈ పిల్లల్నే నా వాళ్లుగా భావిస్తూ వారికి సేవ చేస్తున్నా’ అని వాణి ఈ సందర్భంగా చెప్పారు.

ఇదీ చూడండి: గుంటూరు రైతుల వినూత్న ఆలోచన.. వట్టివేర్ల సాగుతో అద్భుతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.