పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త లోకేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీస్స్టేషన్ ముందే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్న విషయంలో లోకేష్ను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. పోలీసులు స్టేషన్కు పిలిచారనే మనస్తాపంతో లోకేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు ముందు సీఎంను ఉద్దేశిస్తూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లోకేష్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చేరుకున్నారు.
ఇదీచూడండి.