కరోనాను అడ్డం పెట్టుకుని కేంద్రం కార్మిక చట్టం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొవిడ్-19 వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారంటూ ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి... ప్రజలపై ఆర్థిక భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఒక్కో కుటుంబానికి నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :