ETV Bharat / state

మాణిక్యాలరావు కుటుంబాన్ని పరామర్శించిన జీవీఎల్

author img

By

Published : Aug 3, 2020, 11:29 PM IST

ఇటీవల స్వర్గస్తులైన మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పరామర్శించారు.

west godavari district
స్వర్గస్తులైన మాజీమంత్రి కుటుంబాన్ని పరామర్శించిన జీవీఎల్

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల స్వర్గస్తులైన మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాణిక్యాలరావుతో గల అనుభవాలను ఆదర్శ భావాలను పాత్రికేయుల ముందు తెలియజేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మాణిక్యాలరావు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, బ్యాలెన్స్ డ్​గా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మాణిక్యాలరావు అని కొనియాడారు. ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మాత్రమే మాట్లాడేవారని.. తన స్వలాభం కోసం ఏనాడు మాట్లాడలేదని పేర్కొన్నారు. మాణిక్యాలరావు అకాల మరణం తమకు, పార్టీకి తీరని లోటు అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల స్వర్గస్తులైన మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాణిక్యాలరావుతో గల అనుభవాలను ఆదర్శ భావాలను పాత్రికేయుల ముందు తెలియజేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మాణిక్యాలరావు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, బ్యాలెన్స్ డ్​గా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మాణిక్యాలరావు అని కొనియాడారు. ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మాత్రమే మాట్లాడేవారని.. తన స్వలాభం కోసం ఏనాడు మాట్లాడలేదని పేర్కొన్నారు. మాణిక్యాలరావు అకాల మరణం తమకు, పార్టీకి తీరని లోటు అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.


ఇదీ చదవండి జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలు సడలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.