ETV Bharat / state

'2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే'

author img

By

Published : Sep 21, 2020, 6:34 PM IST

2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలంటూ కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలం రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు ఈ మేరకు ఆందోళన చేపట్టారు.

Farmers who lost lands in the construction of the Greenfield National Highway
గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు

పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఎకరాకు రూ.40 లక్షలు ధర వచ్చే భూములకు ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రం ఇస్తామనడం దారుణమన్నారు. పోలీసులతో అరెస్టులు చేయించి బలవంతపు భూసేకరణ చేపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఎకరాకు రూ.40 లక్షలు ధర వచ్చే భూములకు ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రం ఇస్తామనడం దారుణమన్నారు. పోలీసులతో అరెస్టులు చేయించి బలవంతపు భూసేకరణ చేపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు.

ఇవీ చూడండి..

వెంటపడి పెళ్లి చేసుకున్నాడు..కులం పేరుతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.