ETV Bharat / state

'ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా'

తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై పైడికొండల మాణిక్యాలరావు స్పందించారు.

author img

By

Published : Aug 23, 2019, 9:12 PM IST

మాణిక్యాలరావు
పార్టీలు మారే ఆనవాయితీ నాకు లేదు

తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్నానని భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు ఐదు పార్టీలు మారారని... భవిష్యత్తులో వైకాపాలో కొనసాగుతారో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అదోగతి అవుతుందని విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. జగన్ విమర్శించిన వ్యక్తి ఇప్పుడు జగన్కు అంగరక్షకుడుగా ఉంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటారని విమర్శించారు. అమ్మ, నాన్నను ఎలాగైతే మరిచిపోమో.. జీవితాన్ని ఇచ్చిన వృత్తిని కూడా మర్చిపోకూడదని పలికారు.

తిరుమల తిరుపతికి రాకపోకలు సాగించే బస్సులపై క్రైస్తవ మత ప్రచార బ్యానర్లు ఉండటాన్ని తప్పుపట్టారు. గత ప్రభుత్వం కారణంగానే ఇలా జరిగిందని అని చెప్పడం అవివేకం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపించారు. తాను దేవాదాయశాఖ భూములను అన్యాక్రాంతం చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఆరోపణలను రుజువు చేయని పక్షంలో ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి.

'మా పని మేం చేస్తాం... మీ పని మీరు చేయండి'

పార్టీలు మారే ఆనవాయితీ నాకు లేదు

తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్నానని భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు ఐదు పార్టీలు మారారని... భవిష్యత్తులో వైకాపాలో కొనసాగుతారో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అదోగతి అవుతుందని విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. జగన్ విమర్శించిన వ్యక్తి ఇప్పుడు జగన్కు అంగరక్షకుడుగా ఉంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటారని విమర్శించారు. అమ్మ, నాన్నను ఎలాగైతే మరిచిపోమో.. జీవితాన్ని ఇచ్చిన వృత్తిని కూడా మర్చిపోకూడదని పలికారు.

తిరుమల తిరుపతికి రాకపోకలు సాగించే బస్సులపై క్రైస్తవ మత ప్రచార బ్యానర్లు ఉండటాన్ని తప్పుపట్టారు. గత ప్రభుత్వం కారణంగానే ఇలా జరిగిందని అని చెప్పడం అవివేకం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపించారు. తాను దేవాదాయశాఖ భూములను అన్యాక్రాంతం చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఆరోపణలను రుజువు చేయని పక్షంలో ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి.

'మా పని మేం చేస్తాం... మీ పని మీరు చేయండి'

Intro:Ap_Vsp_62_23_AIYF_Agitation_On_Food_Safety_Av_C8_AP10150


Body:ఆహార పదార్థాలను కల్తీ చేసే మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అఖిల భారత యువజన సమాఖ్య ఆందోళన చేపట్టింది మనం తినే ప్రతి ఆహారాన్ని కొందరు డబ్బుకోసం కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారని దానిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని యువజన సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో అనేక క మంది కల్తీ ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కల్తీ ఆహారం తయారుచేసే సంస్థలపై తాము ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.