ETV Bharat / state

జిల్లాలో మొదలైన పురపాలక ఎన్నికల సందడి - elections works stated in west godavari dst

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికల జోరు మొదలైంది. జిల్లాలో కొన్ని పట్టణాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా వేశారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించే పట్టణాల్లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

elections works stated in west godavari dst
జిల్లాలో మొదలైన పురపాలక ఎన్నికల సందడి
author img

By

Published : Mar 10, 2020, 7:45 PM IST

పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతోన్న రాజకీయ పార్టీలు

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించింది. రాష్ట్రంలో 75 పట్టణాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 33 పట్టణాల్లో వివిధ కారణాలతో ప్రక్రియ నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, 8 పట్టణాలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నాలుగు పట్టణాలు నగర పంచాయతీ ఎన్నికల నిలిపివేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో విలీన గ్రామాల అంశం న్యాయస్థానంలో ఉండడం వల్ల ఎన్నికలు నిలిపివేశారు. భీమవరంలో విలీన గ్రామాల ప్రతిపాదన అంశం పరిశీలనలో ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆకివీడు నగరపంచాయతీ కొత్తగా ఏర్పడటంతో ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాలేదు.

జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం పట్టణాలతో పాటు ఏలూరు కార్పొరేషన్​కు ఎన్నికలు జరగనున్నాయి. సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టడానికి రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అధిక శాతం మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రాలు కావడం వల్ల అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు తమ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:

ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?

పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతోన్న రాజకీయ పార్టీలు

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నగారా మోగించింది. రాష్ట్రంలో 75 పట్టణాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 33 పట్టణాల్లో వివిధ కారణాలతో ప్రక్రియ నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, 8 పట్టణాలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నాలుగు పట్టణాలు నగర పంచాయతీ ఎన్నికల నిలిపివేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో విలీన గ్రామాల అంశం న్యాయస్థానంలో ఉండడం వల్ల ఎన్నికలు నిలిపివేశారు. భీమవరంలో విలీన గ్రామాల ప్రతిపాదన అంశం పరిశీలనలో ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆకివీడు నగరపంచాయతీ కొత్తగా ఏర్పడటంతో ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాలేదు.

జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం పట్టణాలతో పాటు ఏలూరు కార్పొరేషన్​కు ఎన్నికలు జరగనున్నాయి. సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టడానికి రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. అధిక శాతం మున్సిపాలిటీ నియోజకవర్గ కేంద్రాలు కావడం వల్ల అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు తమ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:

ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.