ETV Bharat / state

పశ్చిమలో కర్ఫ్యూ.. నిబంధనలు పాటించనివారిపై కేసులు

author img

By

Published : May 12, 2021, 4:44 PM IST

కరోనా మహమ్మారి రెండో దశ విజృంభణ యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు మరింత నియంత్రణ చర్యలు చేపట్టాయి. తణుకు, ఉండ్రాజవరం తదితర మండలాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తున్నారు.

తణుకులో కర్ఫ్యూ
తణుకులో కర్ఫ్యూ

పల్లె, పట్టణం, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మహమ్మారి వెంటాడుతుంటే.. కొంతవరకూ ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమై అడ్డుకట్టవేసేందుకు మరింత నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం తదితర మండలాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. తణుకులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి దుకాణాలను మూసివేయటానికి నిర్ణీత సమయానికి కనీసం పావుగంట ముందు సంసిద్ధత కావాలని తెలియపరిచింది.

పల్లె, పట్టణం, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మహమ్మారి వెంటాడుతుంటే.. కొంతవరకూ ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమై అడ్డుకట్టవేసేందుకు మరింత నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం తదితర మండలాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. తణుకులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి దుకాణాలను మూసివేయటానికి నిర్ణీత సమయానికి కనీసం పావుగంట ముందు సంసిద్ధత కావాలని తెలియపరిచింది.

ఇవీ చూడండి:

పాలకొల్లు ఆస్పత్రిలో విద్యుత్​ అంతరాయం.. కరోనా రోగుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.