ETV Bharat / state

ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో భవన నిర్మాణ కార్మికులు

author img

By

Published : Aug 12, 2020, 10:12 PM IST

ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణాల కార్మికులను కొవిడ్.... కోలుకోలేని దెబ్బతీసింది. వ్యవసాయం తర్వాత.. అధికమంది ఆధారపడిన నిర్మాణ రంగం కుదేలవడంతో... వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. ఉపాధి కరువైన పశ్చిమగోదావరి జిల్లాలోని భవన నిర్మాణ కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

building constructon workers in west godavari
ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో భవన నిర్మాణ కార్మికులు

ఇసుక రవాణాపై నిషేధం, నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చాక ఏర్పడిన ఇసుక కొరతతో... పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి వరకు అడపాదడపా పనులతో... కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులను కరోనా మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. లాక్​డౌన్​ సడలింపులు జరిగినా... కేసుల సంఖ్య పెరగడంతో నిర్మాణ పనులన్ని పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఉపాధి కరువైన కూలీలు... పూటగడవని స్థితిలో కష్టాలను అనుభవిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక, కుటుంబ పోషణ భారమై... పస్తులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

ప్రత్యక్షంగా సుమారు 33 రంగాలకు చెందిన కార్మికులు... పరోక్షంగా 20 రంగాలకు చెందిన కూలీలు ఉపాధి పొందుతున్నారు. తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, సెంట్రింగ్ పనివారు, ఫ్లోరింగ్, పెయింటర్ల వంటి అనేక మంది ఉన్నారు. నిర్మాణ రంగం కుదేలుతో వీధిన పడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లాలో ప్రత్యక్షంగా 78 వేల కుటుంబాలు నిర్మాణరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పరోక్షంగా 1.20లక్షల మంది కూలీలు, కార్మికులు దీనిపైనే ఉపాధి పొందుతున్నారు.

పనుల్లేక కొంతమంది స్వగ్రామాల బాటపట్టగా... మరికొంతమంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇల్లు గడవక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు గుర్తించి.. ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇసుక రవాణాపై నిషేధం, నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చాక ఏర్పడిన ఇసుక కొరతతో... పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి వరకు అడపాదడపా పనులతో... కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులను కరోనా మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. లాక్​డౌన్​ సడలింపులు జరిగినా... కేసుల సంఖ్య పెరగడంతో నిర్మాణ పనులన్ని పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఉపాధి కరువైన కూలీలు... పూటగడవని స్థితిలో కష్టాలను అనుభవిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక, కుటుంబ పోషణ భారమై... పస్తులతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

ప్రత్యక్షంగా సుమారు 33 రంగాలకు చెందిన కార్మికులు... పరోక్షంగా 20 రంగాలకు చెందిన కూలీలు ఉపాధి పొందుతున్నారు. తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, సెంట్రింగ్ పనివారు, ఫ్లోరింగ్, పెయింటర్ల వంటి అనేక మంది ఉన్నారు. నిర్మాణ రంగం కుదేలుతో వీధిన పడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లాలో ప్రత్యక్షంగా 78 వేల కుటుంబాలు నిర్మాణరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పరోక్షంగా 1.20లక్షల మంది కూలీలు, కార్మికులు దీనిపైనే ఉపాధి పొందుతున్నారు.

పనుల్లేక కొంతమంది స్వగ్రామాల బాటపట్టగా... మరికొంతమంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇల్లు గడవక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు గుర్తించి.. ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయడం అన్యాయం.. ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.