ETV Bharat / state

రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం: భాజపా

author img

By

Published : Nov 22, 2020, 7:28 PM IST

ఉంగుటూరులో భాజపా శిక్షణ తరగతులు ముగిశాయి. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని నాయకులు సూచించారు. వైకాపా, తెదేపాలు కులతత్వ రాజకీయాల్లో మునిగితేలుతున్నాయని విమర్శించారు.

BJP training classes ended in Ungujuru
ఉంగుటూరులో భాజపా ప్రశిక్షణ తరగతులు

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలోని సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్​లో భాజపా శిక్షణ తరగతులు ముగిశాయి. వైకాపా, తెదేపాలు కులతత్వ రాజకీయాల్లో మునిగితేలుతున్న పార్టీలని భాజపానేత భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిశోర్ కోరారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలని ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీ రాణి అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలోని సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్​లో భాజపా శిక్షణ తరగతులు ముగిశాయి. వైకాపా, తెదేపాలు కులతత్వ రాజకీయాల్లో మునిగితేలుతున్న పార్టీలని భాజపానేత భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిశోర్ కోరారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలని ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీ రాణి అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.