పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని విత్తన శుద్ధి కర్మాగారాన్ని విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ ఇంజనీర్ అబ్దుల్ రహీమ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సౌజన్యంతో 19కోట్ల 80లక్షల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 33 గోదాముల నిర్మించనున్నట్లు తెలిపారు. గోదాముల్లో మినీ విత్తన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో కుమారదేవం, రావిపాడు, ఎడవల్లి గ్రామాల్లో 3 మినీ గోదాములు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ కర్మాగారాల ద్వారా మొక్కజొన్న అపరాలు, కూరగాయల విత్తనాలు వంటి వాటిని అభివృద్ధి పరిచనున్నట్లు తెలిపారు. రైతులు ఎక్కడికక్కడే సకాలంలో విత్తనాలు అందించడానికి ఈ గోదాముల ద్వారా వీలు పడుతుందని అబ్దుల్ రహీం అభిప్రాయపడ్డారు. ఆయన వెంట ఏపీ సీడ్స్ పశ్చిమ గోదావరి జిల్లా మేనేజర్ నాగసాయిబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: