అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా విజయనగరంలో మహిళా పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళా సాధికారత, విద్యపై చైతన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసు అధికారులతోపాటు... మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, రక్షక్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ కార్యాలయం నుంచి మయూరి కూడలి, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగింది. ద్విచక్రవాహన ర్యాలీ ద్వారా శిరస్త్రాణంపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి..
స్వచ్ఛతలో విజయవాడ @ 12