Lorry overturned: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్ల సీతారాంపురం వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 27 పశువులు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. పార్వతీపురం జిల్లా గుమడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంగా వ్యాన్ నడపడంతో అర్ధరాతి సమయంలో అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వ్యాన్లో కిక్కిరిసి ఆవులను తరలించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మృతి చెందిన ఆవులను పూడ్చివేయించారు. గాయపడినవాటిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: