జగనన్న వసతి దీవెన పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో శ్రీకారం చుట్టారు. అయితే సీఎం మాట్లాడే ముందు... నెల్లిమర్ల మండలం బొప్పడం ఉన్నత పాఠశాల విద్యార్థి అభిమన్యు చేసిన ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు సభికులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 5 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించాడు ఆ విద్యార్ధి. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనర్గళంగా చెప్పేశాడు. అలాగే సీఎం జగన్పై ప్రశంసలు కురిపించాడు. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ చిరునవ్వులు చిందించారు. సీఎం జగన్ మా దేవుడు అంటూ అభిమన్యు తన ప్రసంగాన్ని ముగించాడు. అనంతరం ఆ బుడ్డోడిని సీఎం జగన్ దగ్గరకు తీసుకుని ముద్డాడి... కాసేపు ముచ్చటించారు.
అభిమన్యుడి ప్రసంగానికి జగన్మోహనుడు ఫిదా - సీఎం సభలో విద్యార్థి ప్రసంగం
విజయనగరంలో సోమవారం నిర్వహించిన సీఎం బహిరంగసభలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ప్రసంగంతో ముఖ్యమంత్రి జగన్ను ఫిదా చేశాడు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తడబడకుండా చెప్పేస్తూ... వాటిపై ప్రశంసలు కురిపించాడు.

జగనన్న వసతి దీవెన పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో శ్రీకారం చుట్టారు. అయితే సీఎం మాట్లాడే ముందు... నెల్లిమర్ల మండలం బొప్పడం ఉన్నత పాఠశాల విద్యార్థి అభిమన్యు చేసిన ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు సభికులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 5 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించాడు ఆ విద్యార్ధి. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనర్గళంగా చెప్పేశాడు. అలాగే సీఎం జగన్పై ప్రశంసలు కురిపించాడు. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ చిరునవ్వులు చిందించారు. సీఎం జగన్ మా దేవుడు అంటూ అభిమన్యు తన ప్రసంగాన్ని ముగించాడు. అనంతరం ఆ బుడ్డోడిని సీఎం జగన్ దగ్గరకు తీసుకుని ముద్డాడి... కాసేపు ముచ్చటించారు.
ఇదీ చదవండి: