విజయనగరం కార్పొరేషన్ 5వ డివిజన్లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్పై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి.
5 మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.
ఇదీ చూడండి: అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో