ETV Bharat / state

రోడ్ల మరమ్మతులు చేపట్టాలని పట్టణ కమిటీ సభ్యుల నిరసన - Parvathipuram town committee members latest news

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై పెద్దపెద్ద గోతులు పడ్డాయని... వెంటనే అధికారులు అవి పూడ్చి రోడ్ల మరమ్మతులు చేయాలని పార్వతీపురంలో సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయిందని వెంటనే ఆ రోడ్లన్నీ బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Parvathipuram town committee members protest to repair roads
రోడ్ల మరమ్మతులు చేపట్టాలని పార్వతీపురం పట్టణ కమిటీ సభ్యులు నిరసన
author img

By

Published : Aug 21, 2020, 7:43 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. పార్వతీపురం నుంచి ఒడిశా సరిహద్దు వరకు రహదారులు పూర్తిగా పాడైపోయాయని అన్నారు. రోడ్లపై పెద్ద పెద్ద గోతులు ఉన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వర్షాకాలంలో ఆ గోతుల్లో నీరు చేరటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. పార్వతీపురం నుంచి ఒడిశా సరిహద్దు వరకు రహదారులు పూర్తిగా పాడైపోయాయని అన్నారు. రోడ్లపై పెద్ద పెద్ద గోతులు ఉన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వర్షాకాలంలో ఆ గోతుల్లో నీరు చేరటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పూజ గదుల్లో రాజకీయ జోక్యాన్ని భరించాలా? : రఘురామకృష్ణరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.