ETV Bharat / state

జిల్లాలో కొలిక్కి వచ్చిన ఆక్సిజన్ సమస్య

author img

By

Published : May 19, 2021, 5:23 PM IST

విజయనగరం జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. త్వరలో అదనపు ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. దీనికోసం జర్మన్ హేంగర్ విధానాన్ని అమలు చేసేందుకు కార్యచరణ దిశగా అధికారులు అడుగులేస్తున్నారు. వీటిన్నిటితో పాటు.. పరిశ్రమల్లో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను సేకరించేందుకూ చర్యలు ప్రారంభించారు.

కొలిక్కి వచ్చిన ఆక్సిజన్ సమస్య
కొలిక్కి వచ్చిన ఆక్సిజన్ సమస్య

కొవిడ్ బాధితుల చికిత్స కోసం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం సుమారు 700 ఆక్సిజన్ పడకలున్నాయి. ఈ పడకలకు నిత్యం సుమారు 8.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. ఒక్క జిల్లా కేంద్రాస్పత్రిలోనే సుమారు 200 పడకలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి పైప్ లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఒక కిలోలీటర్ సామర్ధ్యమున్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఉండేవి. కొత్తగా 10 కేఎల్ సామర్థ్యంగల ట్యాంకును ఇటీవలే ప్రారంభించారు. ఈ ట్యాంకు నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ త‌న నిధుల‌ నుంచి 20 ల‌క్ష‌ల‌ రూపాయలు కేటాయించార‌ు.

ఇటీవ‌ల జిల్లా కేంద్రాసుప‌త్రిలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా నూతన ఆక్సిజన్ ట్యాంక్​ను ఏర్పాటు చేశారు. మిమ్స్ కొవిడ్ ఆసుప‌త్రిలో 13 కిలోలీట‌ర్ల ఆక్సిజ‌న్ ట్యాంకును, పార్వతీపురం ఏరియా ఆసుప‌త్రిలో 6 కేఎల్ ట్యాంకు ఏర్పాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ట్యాంకును ఒకసారి నింపితే, సుమారు 48 గంటలపాటు సరిపోతుంది. జిల్లాలో మిగిలిన 70 శాతం ఆక్సిజన్ పడకలు డి- టైప్ సిలిండర్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. వీటికి సరఫరా చేసే ఒక్కో సిలిండర్​లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సిజన్ పడుతోంది. వీటి ద్వారానే దాదాపు 500 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.

బొబ్బిలి పారిశ్రామికవాడలో రెండు ఆక్సిజన్ ఫిల్లింగ్ పరిశ్రమలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో సోనీ ఎంట‌ర్​ప్రైజెస్‌, శ్రీ సాయి శ్రీ‌నివాస గ్యాసెస్ ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ పరిశ్రమల్లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జరుగుతోంది. ఇక్కడి నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు కేవ‌లం గంట‌లోనే ఎక్క‌డికైనా ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌ల‌ుతున్నారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీట‌ర్ల ఆక్సిజ‌న్ ట్యాంక్ వ‌స్తోంద‌ని, దీనితో రోజుకు సుమారు 500 సిలిండ‌ర్ల ఫిల్లింగ్ జ‌రుగుతోంద‌ని అధికారులు చెప్పారు.

జిల్లాలో ప్ర‌స్తుతం రోజుకు సుమారుగా 450 వ‌ర‌కూ సిలండ‌ర్లు అవ‌స‌రం అవుతున్నాయ‌ని, ఆ మేర‌కు నిరాటంకంగా ఉత్ప‌త్తి చేసేందుకు అధికారులు బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఏర్పాట్లు చేశారు. ఉత్పత్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ముగ్గురు నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించామ‌ని, ఆయా ఆసుప‌త్రులు ముందుగా నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించి, త‌మ‌కు కావాల్సిన ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల‌ను తీసుకువెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌ని అధికారులు చెబుతున్నారు. ఇక్క‌డి నుంచి పార్వ‌తీపురం ప్రభుత్వ ఏరియా ఆసుప‌త్రికి నేరుగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంది. జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ ఆసుప‌త్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌కు బొబ్బిలి నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

బొబ్బిలిలో ఉన్న రెండు రీఫిల్లింగ్ కేంద్రాల ద్వారా డి-టైప్ సిలిండర్లు నింపుతున్నారు. రోజుకు 450 నుంచి 500 సిలిండర్లు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతోంది. మిమ్స్​లో వృథాగా ఉన్న సిలిండర్ మేనిఫోల్డ్స్​ను నేవీ సహకారంతో బాగుచేసి వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఒక్కో మేనిఫోల్డ్ ద్వారా నాలుగైదు పడకలకు ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. వీటితో పాటు... మరికొన్ని డీ-టైప్ సిలిండర్లు కూడా అందుబాటులోకి వస్తే జర్మన్ హేంగర్ విధానంలో షెడ్స్ ఏర్పాటు చేసి అదనంగా దాదాపు 200 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 10కిలో లీటర్ల సామార్ధ్యం ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటుపై ఆసుపత్రి వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 26న జరిగిన సంఘటన దృష్ట్యా సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేగవంతంగా తీసుకున్న చర్యల ఫలితంగా నూతన ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా 48గంటల పాటు 150 పడకలకు నిరాటకంగా, ఎలాంటి లోపాలు లేకుండా కరోనా రోగులకు ఆక్సిజన్ అందివచ్చంటున్నారు. గతంలో ఉన్న 2కేల్ ట్యాంకు ద్వారా కేవలం 25 ఆక్సిజన్ వెంటిలేటర్లను మాత్రమే నడిపే అవకాశం ఉండగా... ప్రస్తుతం 10కేల్ ట్యాంక్ నుంచి 50-60వెంటిలేటర్లపై రోగులకు చికిత్స అందించే అవకాశం ఏర్పడిందంటున్నారు.

ప్రైవేటు పరిశ్రమల నుంచి ఆక్సిజన్ సమీకరించేందుకు జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పరిశ్రమలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న ప్రాణవాయువు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో డీ-టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వ చేసే ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు.. జిల్లాలో జాడ లేకుండాపోయిన 250 సిలిండర్లపైనా ఆరా తీస్తున్నారు. వాటిని కనుగొనే ప్రయత్నం ముమ్మరం చేశారు. వాటన్నిటినీ వినియోగంలోకి తీసుకొస్తే రోజుకు సుమారు మరో 400 మందికి ప్రాణవాయువు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు

కొవిడ్ బాధితుల చికిత్స కోసం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం సుమారు 700 ఆక్సిజన్ పడకలున్నాయి. ఈ పడకలకు నిత్యం సుమారు 8.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. ఒక్క జిల్లా కేంద్రాస్పత్రిలోనే సుమారు 200 పడకలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి పైప్ లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఒక కిలోలీటర్ సామర్ధ్యమున్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఉండేవి. కొత్తగా 10 కేఎల్ సామర్థ్యంగల ట్యాంకును ఇటీవలే ప్రారంభించారు. ఈ ట్యాంకు నిర్మాణానికి ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ త‌న నిధుల‌ నుంచి 20 ల‌క్ష‌ల‌ రూపాయలు కేటాయించార‌ు.

ఇటీవ‌ల జిల్లా కేంద్రాసుప‌త్రిలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా నూతన ఆక్సిజన్ ట్యాంక్​ను ఏర్పాటు చేశారు. మిమ్స్ కొవిడ్ ఆసుప‌త్రిలో 13 కిలోలీట‌ర్ల ఆక్సిజ‌న్ ట్యాంకును, పార్వతీపురం ఏరియా ఆసుప‌త్రిలో 6 కేఎల్ ట్యాంకు ఏర్పాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ట్యాంకును ఒకసారి నింపితే, సుమారు 48 గంటలపాటు సరిపోతుంది. జిల్లాలో మిగిలిన 70 శాతం ఆక్సిజన్ పడకలు డి- టైప్ సిలిండర్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. వీటికి సరఫరా చేసే ఒక్కో సిలిండర్​లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సిజన్ పడుతోంది. వీటి ద్వారానే దాదాపు 500 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.

బొబ్బిలి పారిశ్రామికవాడలో రెండు ఆక్సిజన్ ఫిల్లింగ్ పరిశ్రమలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో సోనీ ఎంట‌ర్​ప్రైజెస్‌, శ్రీ సాయి శ్రీ‌నివాస గ్యాసెస్ ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ పరిశ్రమల్లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జరుగుతోంది. ఇక్కడి నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు కేవ‌లం గంట‌లోనే ఎక్క‌డికైనా ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌ల‌ుతున్నారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీట‌ర్ల ఆక్సిజ‌న్ ట్యాంక్ వ‌స్తోంద‌ని, దీనితో రోజుకు సుమారు 500 సిలిండ‌ర్ల ఫిల్లింగ్ జ‌రుగుతోంద‌ని అధికారులు చెప్పారు.

జిల్లాలో ప్ర‌స్తుతం రోజుకు సుమారుగా 450 వ‌ర‌కూ సిలండ‌ర్లు అవ‌స‌రం అవుతున్నాయ‌ని, ఆ మేర‌కు నిరాటంకంగా ఉత్ప‌త్తి చేసేందుకు అధికారులు బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఏర్పాట్లు చేశారు. ఉత్పత్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ముగ్గురు నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించామ‌ని, ఆయా ఆసుప‌త్రులు ముందుగా నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించి, త‌మ‌కు కావాల్సిన ఆక్సిజ‌న్ సిలండ‌ర్ల‌ను తీసుకువెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌ని అధికారులు చెబుతున్నారు. ఇక్క‌డి నుంచి పార్వ‌తీపురం ప్రభుత్వ ఏరియా ఆసుప‌త్రికి నేరుగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంది. జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ ఆసుప‌త్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌కు బొబ్బిలి నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

బొబ్బిలిలో ఉన్న రెండు రీఫిల్లింగ్ కేంద్రాల ద్వారా డి-టైప్ సిలిండర్లు నింపుతున్నారు. రోజుకు 450 నుంచి 500 సిలిండర్లు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతోంది. మిమ్స్​లో వృథాగా ఉన్న సిలిండర్ మేనిఫోల్డ్స్​ను నేవీ సహకారంతో బాగుచేసి వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఒక్కో మేనిఫోల్డ్ ద్వారా నాలుగైదు పడకలకు ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. వీటితో పాటు... మరికొన్ని డీ-టైప్ సిలిండర్లు కూడా అందుబాటులోకి వస్తే జర్మన్ హేంగర్ విధానంలో షెడ్స్ ఏర్పాటు చేసి అదనంగా దాదాపు 200 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 10కిలో లీటర్ల సామార్ధ్యం ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటుపై ఆసుపత్రి వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 26న జరిగిన సంఘటన దృష్ట్యా సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వేగవంతంగా తీసుకున్న చర్యల ఫలితంగా నూతన ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా 48గంటల పాటు 150 పడకలకు నిరాటకంగా, ఎలాంటి లోపాలు లేకుండా కరోనా రోగులకు ఆక్సిజన్ అందివచ్చంటున్నారు. గతంలో ఉన్న 2కేల్ ట్యాంకు ద్వారా కేవలం 25 ఆక్సిజన్ వెంటిలేటర్లను మాత్రమే నడిపే అవకాశం ఉండగా... ప్రస్తుతం 10కేల్ ట్యాంక్ నుంచి 50-60వెంటిలేటర్లపై రోగులకు చికిత్స అందించే అవకాశం ఏర్పడిందంటున్నారు.

ప్రైవేటు పరిశ్రమల నుంచి ఆక్సిజన్ సమీకరించేందుకు జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పరిశ్రమలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న ప్రాణవాయువు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో డీ-టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వ చేసే ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు.. జిల్లాలో జాడ లేకుండాపోయిన 250 సిలిండర్లపైనా ఆరా తీస్తున్నారు. వాటిని కనుగొనే ప్రయత్నం ముమ్మరం చేశారు. వాటన్నిటినీ వినియోగంలోకి తీసుకొస్తే రోజుకు సుమారు మరో 400 మందికి ప్రాణవాయువు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.