ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

author img

By

Published : Dec 17, 2020, 7:32 PM IST

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో జరిగింది.

one person died
రెండు ద్విచక్రవాహనాలు ఢీ

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని సుంకి మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం బంగారమ్మ కాలనీలో నివాసిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు లక్ష్మణరావు, దండాసితో కలిసి బైక్​పై కురుపాం వైపు వెళ్తున్నారు.

సుంకి మలుపు వద్ద వారిని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన జానకి, వెంకటరమణ దంపతులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని సుంకి మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం బంగారమ్మ కాలనీలో నివాసిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు లక్ష్మణరావు, దండాసితో కలిసి బైక్​పై కురుపాం వైపు వెళ్తున్నారు.

సుంకి మలుపు వద్ద వారిని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన జానకి, వెంకటరమణ దంపతులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఊరు ఊరే కూరగాయల తోటగా మారితే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.