ETV Bharat / state

'గతం కంటే ఇప్పుడు ఎన్నికలు బాగా జరుగుతున్నాయి'

author img

By

Published : Mar 14, 2020, 11:57 PM IST

రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడా పెద్ద ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి బొత్స చెప్పారు. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

minister bosta comments on chandrababu
minister bosta comments on chandrababu
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెదేపా నేతలు పరుష పదజాలంతో మాట్లాడుతున్నా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు నచ్చక ఎందరో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు. మాచర్ల ఘటన జరగడానికి తెదేపా నాయకుల చర్యలే కారణమని ఆరోపించారు. అయినా ఆ ఘటనలో ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడటం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెదేపా నేతలు పరుష పదజాలంతో మాట్లాడుతున్నా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు నచ్చక ఎందరో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు. మాచర్ల ఘటన జరగడానికి తెదేపా నాయకుల చర్యలే కారణమని ఆరోపించారు. అయినా ఆ ఘటనలో ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడటం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.