విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో బుధవారం జగన్నాథ స్వామి మారు రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి భక్తులు శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు బాగా పండాలని రైతులు ప్రత్యేక పూజలు చేశారు.
కురుపాం మండలం మొండెంఖల్లు, శివ్వన్నపేటగ్రామాల్లో మారు రథయాత్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
ఇవీ చదవండి: సచివాలయ నిర్మాణ స్థలంలో వివాదం... పోటీగా వెలసిన పునాదిరాళ్లు