ETV Bharat / state

పూర్వ విద్యార్థుల సాయంతో... ఆస్పత్రిలో మంచి నీటి ప్లాంట్​ ఏర్పాటు

విజయనగరం జిల్లా బొబ్బిలి ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు... పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో నీటి శుద్ధి ప్లాంట్​ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు ప్రారంభించారు.

author img

By

Published : Jun 8, 2020, 5:08 PM IST

పూర్వ విద్యార్థుల వితరణ... ఆస్పత్రిలో మంచి నీటి ప్లాంట్​ ఏర్పాటు
పూర్వ విద్యార్థుల వితరణ... ఆస్పత్రిలో మంచి నీటి ప్లాంట్​ ఏర్పాటు

విజయనగరం జిల్లా బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివిన 1977-78 బ్యాచ్​ పూర్వ విద్యార్థులు బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి నీటిశుద్ధి ప్లాంట్​ను అందజేశారు. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేసే ఈ ప్లాంట్​ను రోగులకు ఉపయోగపడే విధంగా అమర్చారు. నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వస్తుంటారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్లాంట్​ ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థులు వెల్లడించారు.

ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నీటి శుద్ధి ప్లాంట్​ను ప్రారంభించారు. నలుగురికీ ఉపయోగపడే విధంగా ప్లాంట్​ ఏర్పాటుచేయడంపై పూర్వవిద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివిన 1977-78 బ్యాచ్​ పూర్వ విద్యార్థులు బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి నీటిశుద్ధి ప్లాంట్​ను అందజేశారు. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేసే ఈ ప్లాంట్​ను రోగులకు ఉపయోగపడే విధంగా అమర్చారు. నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వస్తుంటారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్లాంట్​ ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థులు వెల్లడించారు.

ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నీటి శుద్ధి ప్లాంట్​ను ప్రారంభించారు. నలుగురికీ ఉపయోగపడే విధంగా ప్లాంట్​ ఏర్పాటుచేయడంపై పూర్వవిద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మద్యం కోసం తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.