ETV Bharat / state

ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం

తమ నోటి దగ్గరకి వచ్చే పంటల ఫలాన్ని... ఏనుగులు లాగేసుకుంటున్నాయని కురుపాం నియోజకవర్గంలోని కుమ్మరిగుంట గ్రామ రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నాళ్లు వీటిని భరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 11:49 PM IST

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు
పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిధిలో... రాత్రి వేళల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా వరి, అరటి, కాకర, చెరుకు, బొప్పాయి పంటలు ఏనుగుల దాడిలో ధ్వంసం అయ్యాయి. ఎక్కువ మోతాదులో పంట నష్టం జరిగినా... అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరెవరు బాధితులు
కుమ్మరగుంట గ్రామ పరిధిలో ఉన్న కోట బాలకృష్ణకి సంబంధించిన బొప్పాయి తోట పూర్తిగా నష్టపోయింది. మిరియాల సుశీలకు సంబంధించి కాకర తోట, డ్రిప్ పైపులు, వరి మళ్లను కాళ్లతో తొక్కేశాయి. కొల్లి సింహాచలంకు సంబంధించి 2 ఎకరాల అరటి, కాకర తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. కొల్లి సింహాచలంకి సంబంధించి కాకర, చెరుకు తోటలను నాశనం చేశాయి. స్వామినాయడు వలస గ్రామానికి చెందిన మరడాన తిరుపతినాయుడు భూమిలో చెరుకు పంటను పూర్తిగా నష్టం చేశాయి.
గత ఆరు నెలలుగా కొమరాడ మండలాన్ని అతలాకుతలం చేస్తున్న ఏనుగులను తరలించేందుకు... చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి మూర్తి తెలిపారు. ఇలా ఎన్ని రోజులు నష్టపోవాలని రైతులు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి:బొబ్బిలి రైతన్నలకు పిల్ల కాలువల కష్టాలు

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిధిలో... రాత్రి వేళల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా వరి, అరటి, కాకర, చెరుకు, బొప్పాయి పంటలు ఏనుగుల దాడిలో ధ్వంసం అయ్యాయి. ఎక్కువ మోతాదులో పంట నష్టం జరిగినా... అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరెవరు బాధితులు
కుమ్మరగుంట గ్రామ పరిధిలో ఉన్న కోట బాలకృష్ణకి సంబంధించిన బొప్పాయి తోట పూర్తిగా నష్టపోయింది. మిరియాల సుశీలకు సంబంధించి కాకర తోట, డ్రిప్ పైపులు, వరి మళ్లను కాళ్లతో తొక్కేశాయి. కొల్లి సింహాచలంకు సంబంధించి 2 ఎకరాల అరటి, కాకర తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. కొల్లి సింహాచలంకి సంబంధించి కాకర, చెరుకు తోటలను నాశనం చేశాయి. స్వామినాయడు వలస గ్రామానికి చెందిన మరడాన తిరుపతినాయుడు భూమిలో చెరుకు పంటను పూర్తిగా నష్టం చేశాయి.
గత ఆరు నెలలుగా కొమరాడ మండలాన్ని అతలాకుతలం చేస్తున్న ఏనుగులను తరలించేందుకు... చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి మూర్తి తెలిపారు. ఇలా ఎన్ని రోజులు నష్టపోవాలని రైతులు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి:బొబ్బిలి రైతన్నలకు పిల్ల కాలువల కష్టాలు

Intro:పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులుBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కోమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీ కుమ్మరగుంట గ్రామ పరిధిలో రాత్రి వేళల్లో ఏనుగులు ధ్వంసం చేసినా వరిమళ్లు ,అరటి ,కాకర ,చెరుకు, బొప్పాయి పంటలు ఏనుగుల దాడిలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెరకు డ్రిప్పులు, వరి, అరటి ,కాకర, బొప్పాయి పంటలు
ఎక్కువ మోతాదులో పంట నష్టం జరిగినా కానరాని అడవి అధికారులు .
●నేటికీ పంట పరిహారం అందలేదని అంటివలస, కుమ్మరికుంట ,కంబవలస, గుణానుపురం గ్రామాలకు అందని వైనం గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
●గత ఆరు నెలలుగా కొమరాడ మండలాన్ని అతలాకుతలం చేస్తున్న ఏనుగులు తరలించేందుకు శాశ్విత పరిష్కారం చూపని అటవీ శాఖ అధికారులు ,
●వెంటనే పంటలు పోయిన రైతులకు నష్టపరి ఇవ్వాలని అలాగే ఏనుగులను వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి మూర్తి తెలియజేశారు

●కొమరాడ మండలంలో గత ఆరు నెలలుగా ఏనుగులు పంటలు నష్టపరిిసినప్పుడుకి కూడా అధికారులు అంతంత మాత్రమే నష్టపరి హార౦ గుర్తించి ఇస్తున్నారని, అలాగే రాత్రి వేళల్లో ఏనుగులు కుమ్మరగుంట గ్రామ పరిధిలో ఉన్న కోట బాలకృష్ణ కి సంబంధించి బొప్పాయి తోట పూర్తిగా నష్టపరిచాయి అలాగే మిరియాల సుశీలా భూమిలో ఉన్న కాకర తోట డ్రిప్ పైపులు వరి ఆకుమళ్లు పూర్తిగా పూర్తిగా కాళ్లతో తొక్కడం జరిగింది అలాగే కొల్లి సింహాచలం కు సంబంధించి రెండు ఎకరాల అరటి తోట కాకర తోట పూర్తిగా ధ్వంసం చేశాయి.
●కొల్లి సింహాచలం భూమికి సంబంధించి కాకర చెరుకు తోట పూర్తిగా ధ్వంసం చేశాయి స్వామినాయడు వలస గ్రామానికి చెందిన మరడాన తిరుపతినాయుడు భూమిలో చెరుకు పూర్తిగా నష్టం చేశాయి .
●ఇంత జరిగినా అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నష్టపరిహారం గుర్తించలేదని అలాగే ఏనుగులను పూర్తిస్థాయిలో తరలించే విధంగా చర్యలు తీసుకో తీసుకోవడం లేదని ఇంకా ఎన్ని రోజులు ఇలా రైతులకు నష్టం చేస్తుంటే అధికారులు చూసి చూడనట్లు వుంటున్నారని కావున వెంటనే ఏనుగులు తరలించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని అలాగే ఇంతవరకు పంట నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకొవాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాముసమస్యలు పరిష్కారం చేయని యెడల భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.


బైట్-1:

బైట్-2:

బైట్-3:
Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.