లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలంటూ విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని హితవు పలికిన ఆయన.. ఇంట్లోనే క్షవరం చేయించుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. తన సతీమణి స్వర్ణలత హెయిర్ కట్ చేసిన ఫొటోతో లాక్డౌన్ పాటించాలనే.. సందేశాన్ని చాటారు. జనాలు... భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారని.. అలా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన తల్లి!