విజయనగరం జిల్లాలో వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల నష్టం వాటిల్లింది. జిల్లాలోని పార్వతీపురం సమీపంలోని తోటపల్లి జలాశయంలో పడవలు పాడయ్యాయి. ఈదురు గాలులు దెబ్బకు పడవలపైన ఉండే టాపులు ధ్వంసమయ్యాయి. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో తోటపల్లి జలాశయం వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జలాశయంలో బోట్ షికారుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఆరు బోట్లు ఉండగా... ఈదురు గాలులకు అన్ని దెబ్బతిన్నాయి. కొద్దిరోజులుగా బోటు షికారు నిలిచిపోవడంతో తాళ్లతో వాటిని నీటిలోనే కట్టి ఉంచారు... గాలి దెబ్బకు బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పార్వతీపురంలో ఈదురు గాలులకు పాడైన పడవలు
ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల జలాశయాల్లో పడవలు పాడయ్యాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని తోటపల్లి జలాశయంలో వద్ద ఉన్న ఉద్యానవనం వద్ద అధికారులు బోటు షికారు ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా అవి నిలిచిపోవటంతో ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి.
విజయనగరం జిల్లాలో వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల నష్టం వాటిల్లింది. జిల్లాలోని పార్వతీపురం సమీపంలోని తోటపల్లి జలాశయంలో పడవలు పాడయ్యాయి. ఈదురు గాలులు దెబ్బకు పడవలపైన ఉండే టాపులు ధ్వంసమయ్యాయి. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో తోటపల్లి జలాశయం వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జలాశయంలో బోట్ షికారుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఆరు బోట్లు ఉండగా... ఈదురు గాలులకు అన్ని దెబ్బతిన్నాయి. కొద్దిరోజులుగా బోటు షికారు నిలిచిపోవడంతో తాళ్లతో వాటిని నీటిలోనే కట్టి ఉంచారు... గాలి దెబ్బకు బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి: కురిసిన వర్షాలు..ఆశాజనకంగా నువ్వుల పంట