విజయనగరం జిల్లా ఎస్. కోట పట్టణంలో సర్వే నెంబరు 551-4 లో కేదార్నాథ్ చెరువు గర్భాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఫెన్సింగ్ వేయడంతో చెరువు కింద ఆయకట్టు రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు గురైన 71 సెంట్ల స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు మూడు కోట్ల పైచిలుకు ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సోమవారం తహసీల్దార్ రామారావు ఆధ్వర్యంలో హెచ్డిటి, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, VROలతో కూడిన బృందం వెళ్లారు. ఆక్రమణను గుర్తించి జెసిబితో ఫెన్సింగ్ తొలగించి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.ఈ స్థలం ఆక్రమించి ఫెన్సింగ్ వేసిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామని తహసీల్దార్ రామారావు ప్రకటించారు. ఈ విషయంపై చెరువు కింద ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..