ETV Bharat / state

విజయనగరం గిరిజనుల ఆదర్శ'బాట'కు సోనూసూద్ ఫిదా

author img

By

Published : Aug 24, 2020, 5:42 PM IST

ప్రభుత్వంపై ఆధారపడకుండా శ్రమదానంతో రోడ్డును నిర్మించుకున్న విజయనగరం జిల్లాలోని గిరిజనులపై నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురింపించారు. దేశం మొత్తం వీరిని అనుసరించాలని ట్వీట్ చేశారు. త్వరలోనే వారిని కలుస్తానని తెలిపారు.

sonu sood
sonu sood

విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేపట్టడంపై నటుడు సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారిపై ప్రశంసలు కురిపించారు.

కొదమ పంచాయతీలోని రెండు గ్రామాల గిరిజనులు చందాలు వేసుకొని రహదారి నిర్మించుకున్నారు. కొదమ పంచాయతీలో 150 కుటుంబాలు ఉన్నాయి. వీరు తమ గ్రామాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న బారి గ్రామం సంతకు వెళ్తుంటారు. ఆ ఊరి వరకైనా రహదారి నిర్మించుకోవాలని వారు సంకల్పించారు. ఒక్కో ఇంటికి రెండు వేల రూపాయలు చొప్పున చందాలు సేకరించారు. రెండు పొక్లెయిన్లతో రెండు వారాల పాటు కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టి వేసి 4 కిలోమీటర్ల దారిని ఇటీవలే ఏర్పరుచుకున్నారు.

గిరిపుత్రుల శ్రమైక స్ఫూర్తిని ఈనాడు- ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేశాయి. ఈనాడు-ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ప్రజా చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలీవుడ్ నటుడు సోనూసూద్​కు ట్విట్టర్ ద్వారా విషయాన్ని చేరవేసింది. దీనికి స్పందించిన సోనూ... గిరిజనులను అభినందించారు.

ఇది ఉత్తమ వార్త. దేశం మొత్తం వీరిని అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. కలిసికట్టుగా మనం ఏదైనా చేయగలం... చేద్దాం. త్వరలోనే మీ ప్రాంతానికి వస్తాను. మీరు భారత దేశాన్ని ప్రేరేపిస్తారు- సోనూసూద్, నటుడు

విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేపట్టడంపై నటుడు సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారిపై ప్రశంసలు కురిపించారు.

కొదమ పంచాయతీలోని రెండు గ్రామాల గిరిజనులు చందాలు వేసుకొని రహదారి నిర్మించుకున్నారు. కొదమ పంచాయతీలో 150 కుటుంబాలు ఉన్నాయి. వీరు తమ గ్రామాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న బారి గ్రామం సంతకు వెళ్తుంటారు. ఆ ఊరి వరకైనా రహదారి నిర్మించుకోవాలని వారు సంకల్పించారు. ఒక్కో ఇంటికి రెండు వేల రూపాయలు చొప్పున చందాలు సేకరించారు. రెండు పొక్లెయిన్లతో రెండు వారాల పాటు కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టి వేసి 4 కిలోమీటర్ల దారిని ఇటీవలే ఏర్పరుచుకున్నారు.

గిరిపుత్రుల శ్రమైక స్ఫూర్తిని ఈనాడు- ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేశాయి. ఈనాడు-ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ప్రజా చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలీవుడ్ నటుడు సోనూసూద్​కు ట్విట్టర్ ద్వారా విషయాన్ని చేరవేసింది. దీనికి స్పందించిన సోనూ... గిరిజనులను అభినందించారు.

ఇది ఉత్తమ వార్త. దేశం మొత్తం వీరిని అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. కలిసికట్టుగా మనం ఏదైనా చేయగలం... చేద్దాం. త్వరలోనే మీ ప్రాంతానికి వస్తాను. మీరు భారత దేశాన్ని ప్రేరేపిస్తారు- సోనూసూద్, నటుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.