ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. 'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు.
ఇదీచదవండి