ETV Bharat / state

వైద్యంతో పాటు.. ధూమపానంపై అవగాహన

పొగ శరీరాన్ని పీల్చేస్తూ... అవయవాలను నాశనం చేస్తుంది. పొగతాగే వారితోపాటుగా పక్కనున్న వారికీ హాని కలిగిస్తుంది. హానికరమైన పొగాకుకు స్వస్తి పలకాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. పొగాకు బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో పొగతాగేవారికి కౌన్సిలింగ్ ఇస్తూ... దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.

author img

By

Published : May 31, 2019, 1:35 PM IST

ధూమపాన నియంత్రణ విభాగం
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించే సమయంలో... పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వైద్యంతోపాటు... కౌన్సిలింగ్ ఇస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి వైద్యులు. పాఠశాల, కళాశాలలో పొగ తాగడం వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్​తో పాటుగా శరీరంలోని అవయవాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పొగతాగే అలవాటు మాన్పించాలంటే... దీని వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు... అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిచింది. జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి... దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగానికి వచ్చిన పలువురు ఇక్కడ అందిస్తున్న కౌన్సిలింగ్ ద్వారా పొగాకుకు దూరంగా ఉంటున్నారని సైకాలజిస్ట్ శ్యామల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇదీ చదవండీ...

కొత్త ప్రభుత్వ పథకాలేంటీ... అమెరికా విద్యార్థుల ఆరా

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించే సమయంలో... పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వైద్యంతోపాటు... కౌన్సిలింగ్ ఇస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి వైద్యులు. పాఠశాల, కళాశాలలో పొగ తాగడం వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్​తో పాటుగా శరీరంలోని అవయవాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పొగతాగే అలవాటు మాన్పించాలంటే... దీని వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు... అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిచింది. జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి... దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగానికి వచ్చిన పలువురు ఇక్కడ అందిస్తున్న కౌన్సిలింగ్ ద్వారా పొగాకుకు దూరంగా ఉంటున్నారని సైకాలజిస్ట్ శ్యామల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇదీ చదవండీ...

కొత్త ప్రభుత్వ పథకాలేంటీ... అమెరికా విద్యార్థుల ఆరా

Intro:ap_cdp_16_31_pogaku_day_rally_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
పొగాకును నమిలితే అది మన జీవితాన్ని నాశనం చేస్తుందని కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉమా సుందరి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కడపలో డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నగరపాలక కార్యాలయం నుంచి బయలుదేరి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. అనంతరం మానవహారం చేపట్టారు. పొగాకు వల్ల దేశంలో ప్రతి ఏడాది లక్ష మంది మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వము గుట్కా నిషేధించినప్పటికీ ఇంకా అక్కడక్కడ వాటిని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. పొగాకును ఉపయోగించడం మానుకోవాలని, దీనివల్ల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. పొగాకు వల్ల కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆమె చెప్పారు. ర్యాలీలో లో ఎం సి సి విద్యార్థులు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.



Body:పొగాకు వ్యతిరేక ర్యాలీ


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.