ఇవీ చదవండి...గంజాయి గుంజుతున్న హైదరాబాద్...!
విశాఖ పోలీసుల అదుపులో బిహార్ ముఠా
విశాఖలో కంచరపాలెం నుంచి రైల్వేస్టేషన్కు గంజాయి తరలిస్తున్న బిహార్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాన్ని దిల్లీకి రవాణా చేసేందుకు ప్రయత్నించారని విచారణలో తేలింది.
విశాఖ పోలీసులకు చిక్కిన బిహార్ ముఠా
విశాఖపట్నంలో గంజాయి తరలిస్తున్న ఓ బిహార్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రైలులో దిల్లీకి తరలించేందుకు సిద్దం చేశారని విచారణలో తేలింది. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కంచరపాలెం వద్ద అనుమానంతో తనిఖీలు చేయగా... వారి బ్యాగుల్లో 50 కేజీల మత్తు పదార్థం గుర్తించామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా రవాణా చేస్తున్నట్లు తేలింది.
ఇవీ చదవండి...గంజాయి గుంజుతున్న హైదరాబాద్...!