ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ - corona updares in vizag

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ పరిశీలించి... అధికారులకు పలు సూచనలు చేశారు.

Vishakha Range DIG examining the Red Zone in narseepatnam
రెడ్​జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ
author img

By

Published : Apr 9, 2020, 6:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు పరిశీలించారు. పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసులను, అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. రెడ్​జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో సురక్షిత వాతావరణం కల్పించే విధంగా పురపాలక, ఆరోగ్య సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చేయాలని సూచించారు. పట్టణంలో కర్ఫ్యూను మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు పరిశీలించారు. పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసులను, అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. రెడ్​జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో సురక్షిత వాతావరణం కల్పించే విధంగా పురపాలక, ఆరోగ్య సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చేయాలని సూచించారు. పట్టణంలో కర్ఫ్యూను మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఇదీ చదవండి.

'ఉదయం 9 గంటల వరకే అనుమతి..అతిక్రమిస్తే చర్యలే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.