ETV Bharat / state

సింహచలంలోని శిబిరాలకు విశాఖ బాధితుల తరలింపు

author img

By

Published : May 13, 2020, 11:23 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకైన ఘటనలో..కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితులను సింహచలంలోని శిబిరాలకు తరలించారు. ఆరోగ్యం మెరుగుపడకుండానే బలవంతంగా తమని తరలిస్తున్నారని బాధితులు తెలిపారు.

Visakha victims evacuate to camps in Simhachalam
సింహచలంలోని శిబిరాలకు విశాఖ బాధితుల తరలింపు
సింహచలంలోని శిబిరాలకు విశాఖ బాధితుల తరలింపు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితులను శిబిరాలకు తరలించారు. సాయంత్రం మంత్రులు చెక్కులు అందజేసిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని తమపై అధికారులు ఒత్తిడి తెచ్చారని బాధితులు చెబుతున్నారు. తమ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని అయినా పోలీసులు, అధికారులు బలవంతంగా తరలిస్తున్నారని వారు వాపోయారు.

సింహచలంలో 21 కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ వైద్య సదుపాయం కూడా కల్పించినట్లు విశాఖ అర్బన్ తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు.

ఇదీచూడండి.

వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు

సింహచలంలోని శిబిరాలకు విశాఖ బాధితుల తరలింపు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితులను శిబిరాలకు తరలించారు. సాయంత్రం మంత్రులు చెక్కులు అందజేసిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని తమపై అధికారులు ఒత్తిడి తెచ్చారని బాధితులు చెబుతున్నారు. తమ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని అయినా పోలీసులు, అధికారులు బలవంతంగా తరలిస్తున్నారని వారు వాపోయారు.

సింహచలంలో 21 కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ వైద్య సదుపాయం కూడా కల్పించినట్లు విశాఖ అర్బన్ తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు.

ఇదీచూడండి.

వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.